
క్రీడలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించగా, ఈ ఒప్పందంపై ఈ నెల 19వ తేదీన అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది. సుంకాలు లేకుండా వాణిజ్య నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలకు అమెరికా, ఇరాన్ సమ్మతి తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తూ, ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!