
సినిమాలు

తన కుమారుడు కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భావోద్వేగ లేఖ రాశారు. కేవలం 20 రోజుల వ్యవధిలో తన కుమారుడిని, తండ్రిని కోల్పోయామని, దీంతో తమ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు అవసరం లేదని, వేగవంతమైన న్యాయ ప్రక్రియ మాత్రమే కావాలని విశాల్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. తన కుమారుడి కేసు మరో పెండింగ్ ఫైల్గా మారకుండా చూడాలని కోరారు. మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ హత్యకు గురైనట్లు ఆరోపణలు ఉండగా, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. నిందితుడు న్యాయస్థాన కస్టడీలో ఉన్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!