

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం ఉదయం ముంబయిలో భుజం శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు రెండు భుజాల్లోనూ తీవ్రంగా రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు సూచించారు. అయితే ఇప్పటికే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచించడంతో తొలుత కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. శనివారం జరిగిన ఈ శస్త్ర చికిత్సకు సుమారు మూడున్నర గంటల సమయం పట్టింది. 2016లో తగిలిన గాయాలకు తోడు, పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులు పట్టుకుని లాగడం వల్ల గాయాలు తీవ్రతరం అయినట్లు సమాచారం. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!