

గోదావరి పుష్కరాల ఘాట్లలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు నారాయణ, కందుల దుర్గేశ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పుష్కరాల ఏర్పాట్లపై పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి, శాఖల మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
పుష్కరాల కోసం మున్సిపల్ శాఖ నుంచి ఇప్పటికే రూ.585 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇరిగేషన్, దేవాదాయ, హోం, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి ఘాట్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించేలా భద్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!