
సినిమాలు

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ యూనిట్లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన ఆయన, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!