
సినిమాలు

హైదరాబాద్లో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూబ్లీ ఎన్క్లేవ్లోని ఓ పిజ్జా కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. పరిశుభ్రత, ఆహార నిల్వ విధానాల్లో నిర్లక్ష్యం కనిపించినట్లు గుర్తించారు.
తనిఖీల సందర్భంగా రెస్టారెంట్లో భారీ సంఖ్యలో బొద్దింకలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. గడువు ముగిసిన మసాలాలు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తులను గుర్తించారు. అలాగే లేబుల్స్ లేకుండా ఆహార పదార్థాలను నిల్వ ఉంచడంతో పాటు ఫ్రీజర్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన లోపాలపై సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!