

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు 16 వాహన, డెలివరీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మె కారణంగా ఆటోలు, క్యాబ్లు, లారీలు, అలాగే ఓలా, ఉబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ వంటి యాప్ ఆధారిత రవాణా, డెలివరీ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. తమ సమస్యలను ప్రభుత్వం ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని జేఏసీ తెలిపింది.
యాప్ ఆధారిత సేవలకు కనీస బేస్ఫేర్తో పాటు ప్రతి కిలోమీటర్, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను ప్రభుత్వం నోటిఫై చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే తెలంగాణ గిగ్, ప్లాట్ఫారం వర్కర్స్ రూల్స్ను వెంటనే అమలు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025ను పూర్తిగా అమలు చేయాలని, ప్రైవేట్ వాహనాలను కమర్షియల్ రిజిస్ట్రేషన్ లేకుండా యాప్ ఆధారిత సేవలకు వినియోగించకుండా నిషేధించాలని కోరుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!