

హైదరాబాద్లో గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆగస్టు 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సచివాలయంలో యూనియన్ నేతలతో సమావేశమై కార్మికుల సమస్యలు, సంక్షేమం, సామాజిక భద్రత అంశాలపై విస్తృతంగా చర్చించారు.
గిగ్ వర్కర్ల హక్కులను పరిరక్షించడం, వారికి సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ చట్టాన్ని తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. చట్ట అమలుకు అవసరమైన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై నమ్మకం వ్యక్తం చేసిన యూనియన్ ప్రతినిధులు సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!