

బోనాల వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఓ పోస్ట్పై ఏర్పడిన వివాదంపై నటి ఫరియా అబ్దుల్లా మరోసారి స్పందించింది. తన తాజా చిత్రం ‘సిగ్మా’ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆమె, తన పోస్ట్కు వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. ఈ వివాదం సందర్భంగా సమాజంలో ఇప్పటికీ కొన్ని సంప్రదాయపరమైన ఆలోచనా విధానాలు కొనసాగుతున్నాయని గమనించినట్లు చెప్పింది.
సోషల్ మీడియా తన అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే ఒక వేదిక మాత్రమేనని ఫరియా పేర్కొంది. ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చని, వాటితో తాను ఏకీభవించకపోయినా ఇతరుల ఆలోచనా విధానాన్ని గౌరవిస్తానని చెప్పింది. ఇక ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. తన ఆలోచనా విధానం శాంతి, ప్రేమ చుట్టూనే ఉంటుందని తెలిపింది. ‘సిగ్మా’ విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో ఇక అందరి దృష్టి సినిమా ప్రమోషన్స్పైనే ఉండాలని ఆమె కోరుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!