

ఇండియన్ సినిమాలో టైమ్ ట్రావెల్ లేదా కాలమానాలకు సంబంధించిన కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. 1990లలోనే నందమూరి బాలకృష్ణ హీరోగా, విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ ఈ జానర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి పరిస్థితులకు భిన్నంగా ఆలోచించి రూపొందించిన ఈ చిత్రం గతం, వర్తమానం, భవిష్యత్ కాలాలను కథలో భాగంగా చూపిస్తూ మంచి విజయాన్ని సాధించింది.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లోనూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉండనున్నట్లు ఇప్పటికే మేకర్స్ స్పష్టం చేశారు. గతం, వర్తమానంతో పాటు 2070 తర్వాతి కాలంలో జరిగే సన్నివేశాలను కూడా సినిమాలో చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ‘ఆదిత్య 369’ తరహాలో మూడు కాలమానాలను ఈ సినిమాలో చూడొచ్చనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!