

జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసనల నేపథ్యంలో తాను కలత చెందానని పేర్కొంటూ గుజరాత్కు చెందిన పోలీసు కానిస్టేబుల్ రామ్గర్ గోసాయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తూర్పు కచ్లోని అడేసార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి రంగంలోకి దిగడం తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
తాను ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించానని, అయితే ఇటీవల జరిగిన నిరసనల నేపథ్యంలో యువత కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు గోసాయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్కు మద్దతుగా పనిచేయాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన జీవితాన్ని, సేవలను ఆర్ఎస్ఎస్కు అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలే తన జీవిత ప్రయాణాన్ని మరో మలుపు తిప్పాయని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!