
జనరల్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో కోరారు. వెంటనే తప్పుడు ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!