

సిడ్నీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్లో గత ఏడాది డిసెంబర్లో జరిగిన కాల్పుల ఘటనలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన హైదరాబాద్కు చెందిన క్యాబ్ డ్రైవర్ రెహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (పర్మనెంట్ రెసిడెన్సీ) మంజూరు చేసింది. కాల్పుల సమయంలో ప్రాణభయాన్ని లెక్కచేయకుండా అక్కడే ఉండి గాయపడిన దాదాపు 20 మందిని అంబులెన్స్ల వరకు చేర్చి వారి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ అరుదైన గౌరవాన్ని ప్రకటించగా, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.
రెహ్మత్ పాషా ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఆయన పేరును పలు సాహస పురస్కారాలకు నామినేట్ చేశారు. ఘటన సమయంలో ఆయన ధరించిన టోపీని సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే ఆ దుర్ఘటన మానసికంగా తీవ్ర ప్రభావం చూపడంతో కొంతకాలం చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ కాల్పుల్లో 15 మంది మరణించగా, ఘటనకు పాల్పడిన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్లకు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!