

వాట్సాప్ ద్వారా నకిలీ సందేశం పంపించి చీరల దుకాణం అకౌంటెంట్ నుంచి రూ.కోటి కాజేసిన సైబర్ మోసం కేసులో లక్నోకు చెందిన దీపక్ కుమార్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దుకాణ యజమాని పేరుతో పాటు ఆయన వాట్సాప్ డీపీని ఉపయోగించి నిందితుడు నకిలీ మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. యజమాని నుంచి వచ్చిన సందేశమేనని భావించిన అకౌంటెంట్ పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేయడంతో మోసం జరిగింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ వివరాల ప్రకారం.. కోర్టు సత్వర ఆదేశాలు, పోలీసుల చొరవతో కేవలం 10 రోజుల్లోనే రూ.కోటి మొత్తాన్ని రికవరీ చేసి బాధితుడికి అందించారు. పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని ఎవరైనా కోరినప్పుడు కేవలం వాట్సాప్ పేరు, డీపీ ఆధారంగా నమ్మి నగదు బదిలీ చేయవద్దని పోలీసులు సూచించారు. డబ్బులు పంపే ముందు ఇతర మార్గాల్లో సంబంధిత వ్యక్తిని సంప్రదించి వివరాలను ధ్రువీకరించుకోవాలని తెలిపారు. వాట్సాప్ లేదా ఇతర యాప్ల ద్వారా వచ్చే గుర్తుతెలియని ఏపీకే ఫైళ్లను మొబైల్లో ఇన్స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!