

హైదరాబాద్లో మరో భారీ క్రీడా మౌలిక వసతి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ సమీపంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ స్టేడియంలో 1.32 లక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించేలా సామర్థ్యం కల్పించనున్నారు. ప్రతిపాదిత సామర్థ్యం ప్రకారం నిర్మాణం పూర్తయితే.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని అధిగమించి దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిలిచే అవకాశం ఉంది.
ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ స్థాయి కీలక క్రికెట్ మ్యాచ్లను నిర్వహించేందుకు వీలుగా ఆధునిక వసతులు కల్పించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ క్రీడా మౌలిక వసతులకు మరింత ఊతం లభించడంతో పాటు నగరం ప్రముఖ క్రీడా గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులకు ఈ స్టేడియం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!