
జనరల్

రానున్న భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ORR వరకు 889 వాటర్ లాగింగ్ పాయింట్లు గుర్తించామని, మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటికే సమీక్షలు నిర్వహించామని చెప్పారు.
555 మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ రిస్పాన్స్ బృందాలను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫ్లైఓవర్లపై వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఐటీ కారిడార్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు హైడ్రా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!