
రాజకీయాలు

హార్ముజ్ జలసంధిలో యూఏఈ వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో భారత నావికుడు మృతి చెందడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విదేశాంగశాఖ పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గాల్లో సురక్షిత, నిరంతర వాణిజ్య రాకపోకలు వెంటనే పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో న్యూఢిల్లీలోని విదేశాంగశాఖ కార్యాలయానికి ఇరాన్ సీనియర్ దౌత్యవేత్తలను, ఉప రాయబారిని పిలిపించి భారత్ అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులు ప్రాంతీయ శాంతి, సముద్ర భద్రతకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొంటూ, ఈ ఘటనపై బాధ్యత వహించాలని భారత్ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!