
జనరల్

పోక్సో కేసులో అరెస్టైన నిందితుడు రాజ్కుమార్ బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆరోపించారు. నిందితుడి నుంచి లంచం తీసుకుని విడుదలకు పోలీసులు సహకరించారన్న ఆరోపణలు తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నిందితుడు అనంతరం ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాడని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళల శాంతి, భద్రతలను కాపాడాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!