
రాజకీయాలు

రాష్ట్రంలోని ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఏడాదిలో రెండు సార్లు టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. తొలి ప్రత్యేక టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ను జూలై 21న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక టెట్కు ప్రస్తుత సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని, యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!