
జనరల్

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన జగన్ 2.0 సూపర్ యాప్కు పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రారంభించిన గంటలోనే 25 వేల డౌన్లోడ్లు నమోదుకాగా, ప్రస్తుతం లక్షకు పైగా డౌన్లోడ్లు దాటింది.
ఈ యాప్ ద్వారా కార్యకర్తల నుంచి పార్టీ నాయకుల వరకు అందరినీ ఒకే వేదికపై అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు అడగడం, అభిప్రాయాలు పంచుకోవడం, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం పొందడం వంటి అవకాశాలు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంటాయని పార్టీ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!