
జనరల్

పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రైలు స్కూల్ వ్యాన్ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రైల్వే గేటు తెరిచి ఉండగానే స్కూల్ వ్యాన్ ట్రాక్ దాటే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!