
జనరల్

దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహమ్మద్ (JeM) నెట్వర్క్తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ను భద్రతా సంస్థలు కీలక విజయంగా భావిస్తున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెట్వర్క్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర అనుబంధాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!