
జనరల్

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష విధానంలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ప్రశ్నల క్లిష్టతను మార్చే అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని ఐఐటీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రతిపాదించింది.
కొత్త విధానంలో విద్యార్థి సమాధానాలను బట్టి తదుపరి ప్రశ్నల స్థాయిని మార్చే సాంకేతికతను ఉపయోగించనున్నారు. వివిధ స్థాయిల ప్రశ్నలను డైనమిక్గా రూపొందించే టూల్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. కోచింగ్ ఆధారిత పరీక్షా వ్యూహాలను తగ్గించి, విద్యార్థి ఆలోచనా సామర్థ్యం, తార్కిక నైపుణ్యాలను మెరుగ్గా అంచనా వేయడమే లక్ష్యంగా ఈ మార్పులను పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!