

డిసెంబర్లో నిర్వహించనున్న "తెలంగాణ రైజింగ్–2026" గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమ్మిట్ కీలక వేదికగా నిలవాలని సూచించారు.
తెలంగాణను అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో గ్లోబల్ సమ్మిట్ కీలకమని సీఎస్ పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాలను సమ్మిట్ కోసం వినియోగించుకోవాలని, రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను సకాలంలో సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!