
జనరల్

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ఎథిక్స్ కమిటీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎథిక్స్ కమిటీ ఇప్పటికే సమగ్ర విచారణ పూర్తి చేసింది.
తాజా సమావేశంలో విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించి, నివేదికను అసెంబ్లీ స్పీకర్కు పంపించనుంది. సమావేశానికి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వెడమబొజ్జు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు, పైడి రాకేష్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!