
జనరల్

రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మకమైన రైతు భరోసా పథకం నిధుల విడుదలకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. అర్హులైన రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయాన్ని నేరుగా జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది.
నిధుల పంపిణీని ఈసారి విడతల వారీగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులు, రెండవ దశలో రెండు ఎకరాల వరకు ఉన్న రైతులు, మూడవ దశలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేయనున్నారు. మిగతా రైతులకు కూడా దశలవారీగా నిధులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!