

కల్తీ పాల ఉత్పత్తుల విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా అనలాగ్ (నాన్-డెయిరీ) పనీర్ తయారీ, విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్పత్తిని వినియోగించడం వల్ల మరణం సంభవిస్తే యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో ఛత్తీస్గఢ్ తర్వాత ఈ తరహా నిషేధాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
అనలాగ్ పనీర్ సాధారణ పనీర్తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో పాలను ఉపయోగించకుండా పామాయిల్ వంటి వెజిటేబుల్ ఆయిల్, స్టార్చ్, పాలపొడి వంటి పదార్థాలతో తయారు చేస్తారు. రూపంలో సాధారణ పనీర్లాగే కనిపించినప్పటికీ, తక్కువ ధరకు లభిస్తుంది. అయితే వినియోగదారులకు సరైన సమాచారం ఇవ్వకుండా దీన్ని అసలైన పాల పనీర్గా విక్రయిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!