
క్రీడలు

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) నిజాంపేట్ సర్కిల్లో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టెండర్లు, పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు అన్నీ తన నియంత్రణలో పెట్టుకుని ఓ ఇంజినీరు భారీ స్కామ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తండ్రి పేరుతో ఏజెన్సీ ఏర్పాటు చేసి దాని ద్వారా రూ.2.96 కోట్ల బిల్లులు తీసుకున్నట్లు, అలాగే బినామీ సంస్థల ద్వారా సుమారు రూ.10 కోట్ల పనులు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సిఎంసీ అధికారులు విచారణ ప్రారంభించారు.
ధీరజ్రెడ్డి అనే ఇంజినీరు చెత్త నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, సివిల్ పనులను వ్యక్తిగత లాభానికి వినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్ల మధ్య వివాదాలపై జరిగిన సంభాషణ వీడియో కూడా బయటపడింది. బాధిత గుత్తేదారుల ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!