
జనరల్

జాతీయ చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ తదితరులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చేనేత కళాకారుల శ్రమ, నైపుణ్యాన్ని అభినందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన మంగళగిరి చేనేత వస్త్రాన్ని ప్రధానమంత్రి మోదీకి బహూకరించారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత కళాకారుల ప్రతిభను జాతీయ స్థాయిలో చాటిచెప్పడంతో పాటు, చేనేత రంగానికి ప్రోత్సాహం అందించాలనే సందేశాన్ని వారు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!