
జనరల్

‘మార్గాలు వేరైనా...కలలు ఒక్కటే’ అంటూ మహిళా బైకర్లు బుల్లెట్లపై బారులు తీరారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ‘మన ఆంధ్ర.. మన డబ్ల్యూఏపీఎల్’ పేరుతో ‘బైక్స్ అండ్ బ్యాట్స్ కమింగ్ టుగెదర్’ నినాదంతో సాగిన ఈ ర్యాలీ నోవాటెల్ హోటల్ నుంచి మంగళగిరి స్టేడియం వరకు కొనసాగింది.
గుంటూరు, విశాఖపట్నం, అమరావతి, విజయవాడ, హైదరాబాద్కు చెందిన సుమారు 100 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని డబ్ల్యూఏపీఎల్కు సంఘీభావం తెలిపారు. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!