

మారిషస్లో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా నేతృత్వంలోని ప్రతినిధి బృందం భట్టి విక్రమార్కతో భేటీ అయింది.
తెలంగాణ, మారిషస్ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఆయన గుర్తుచేశారు. మారిషస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రామ భజన కార్యక్రమానికి, విద్య, సాంస్కృతిక పరిశోధన, కళలు, భాష, సాంస్కృతిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తెలంగాణ చేస్తున్న కృషికి మారిషస్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!