

నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని నైస్ నగరంలో నిర్వహించిన ‘ఇండియా ఇన్నోవేట్స్’ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. భారత్-ఫ్రాన్స్ బంధం కేవలం సాంకేతిక భాగస్వామ్యం మాత్రమే కాదని, పరస్పర విశ్వాసం మరియు సమాన విలువలపై నిర్మితమైన బలమైన సంబంధమని మోదీ పేర్కొన్నారు.
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని, దేశంలో రెండు లక్షలకు పైగా స్టార్టప్లు, 120కిపైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయని మోదీ వెల్లడించారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, అంతరిక్ష సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. మెక్రాన్ మాట్లాడుతూ, AI, వాతావరణ మార్పు, ఇంధన రంగం, అణుశక్తి సాంకేతికతలలో భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధిలో కూడా కీలక పురోగతి సాధిస్తున్నామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!