

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులపై చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రంగా ఖండించింది. ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పాఠశాల విద్యార్థుల సమక్షంలో చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇది మొత్తం విద్యా వ్యవస్థను అవమానించినట్లేనని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్), పీఆర్సీ అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యోగులపై ఏసీబీ, సీఐడీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చాక్పీస్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేవని, స్కావెంజర్లకు జీతాలు చెల్లించడం లేదని పేర్కొంటూ విద్యాశాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఓపీఎస్, డీఏల సాధన కోసం అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!