
బిజినెస్

గాదె సాయికృష్ణ మృతిపై ఆయన తల్లి తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని క్రూరంగా హింసించి మేకులతో కొట్టి హతమార్చారని ఆరోపించారు. తమ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, మమ్మల్ని కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తన కుమారుడి బూడిద అయినా ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు, ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని, అసలు బాధ్యులు ఇంకా బయటే ఉన్నారని ఆమె అన్నారు. తన కుమారుడిపై జరిగిన హింస వెనుక ఉన్న ప్రధాన నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. లాక్అప్ డెత్పై జరుగుతున్న విచారణ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!