

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అమరరాజా సంస్థ గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న పరిస్థితులపై బహిరంగంగా స్పందించారు. సంస్థ వైస్ చైర్మన్ జయదేవ్ గల్లాను ఉద్దేశించి చేసిన ప్రకటనలో, నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సంస్థకు ప్రోత్సాహం లభించాల్సిందని, ఇబ్బందులు ఎదురుకావడం బాధాకరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారిందని పేర్కొంటూ, అమరరాజా భవిష్యత్ విస్తరణలో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో సంస్థ కొత్త తయారీ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా జయదేవ్ గల్లాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమరరాజా ప్రయాణంలోని తదుపరి విజయగాథలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!