
ఆరోగ్యం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ (యూజీ) 2026 పరీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు ప్రచారం అవుతున్నాయని స్పష్టం చేసింది. ఆ వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా తప్పుడు, ప్రజలను తప్పుదోవ పట్టించేదని ఎన్టీఏ తెలిపింది. పరీక్ష ఎలాంటి అంతరాయం లేకుండా కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విజయవంతంగా నిర్వహించబడిందని పేర్కొంది.

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తయారు చేయడం, ప్రచారం చేయడం నేరమని ఎన్టీఏ హెచ్చరించింది. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ లేదా ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే సమాచారాన్ని నమ్మాలని సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!