

15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఒడియా సాహిత్య గ్రంథమైన లక్ష్మీ పురాణం పరిరక్షణ, ప్రచారం కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కవి బలరాం దాస్ స్మారక స్థలం ఉన్న పూరీ జిల్లా బేగునియా గ్రామంలో ₹28 కోట్ల వ్యయంతో లక్ష్మీ పురాణం కల్చరల్ కారిడార్ నిర్మించనుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రంథం ఒక కోటి ప్రతులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని పలు భారతీయ భాషల్లోకి అనువదించే ప్రణాళిక కూడా సిద్ధం చేసింది.
ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిడా మాట్లాడుతూ, లక్ష్మీ పురాణంలో నిక్షిప్తమైన శాశ్వత విలువలను యువతకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. హిందూ సంప్రదాయానికి చెందిన ఈ గ్రంథం సామాజిక సమానత్వం, మహిళల హక్కులు వంటి ప్రగతిశీల భావాలను ప్రతిబింబించడం వల్ల విశిష్ట గుర్తింపు పొందింది. ఇందులో దేవి లక్ష్మి దళిత మహిళ శ్రీయ ఇంటికి వెళ్లిన కథ ద్వారా కుల వివక్షను వ్యతిరేకిస్తూ, గౌరవం, భక్తి, సమానత్వమే ముఖ్యమని సందేశం ఇస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!