15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది - సీఎం చంద్రబాబు

Writer: Harika S 11:36 PM, 14 ఆగస్టు, 2026
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది - సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తైంది. గతేడాది ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా పరిమితులు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 87 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. మహిళల ప్రయాణానికి ప్రభుత్వం రోజుకు సగటున రూ.8.53 కోట్ల సబ్సిడీ అందిస్తుండగా, ఏడాదిలో రూ.3,095 కోట్లు ఖర్చు చేసింది.

ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 9,978 ఆర్టీసీ బస్సుల్లో 7,631 బస్సులు, అంటే 76 శాతం బస్సులను స్త్రీ శక్తి పథకానికి వినియోగిస్తున్నారు. ఆలయాలకు నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా 40 శాతం ఉండగా, ప్రస్తుతం 62 శాతానికి పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య 9.47 లక్షల నుంచి 24 లక్షలకు చేరుకుంది. పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ 93 శాతానికి చేరింది. పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడుకు భారీ పెట్టుబడులు...

తమిళనాడుకు భారీ పెట్టుబడులు...

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా స్మార్ట్ రేషన్ కార్డులు.. టీజీ కేబినెట్ కీలక నిర్ణయం

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా స్మార్ట్ రేషన్ కార్డులు.. టీజీ కేబినెట్ కీలక నిర్ణయం

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ట్యాగ్లు
స్త్రీ శక్తి పథకంచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ఉచిత బస్సు ప్రయాణంమహిళా సాధికారతఏపీఎస్ఆర్టీసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది - సీఎం చంద్రబాబు
జనరల్

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది - సీఎం చంద్రబాబు

తమిళనాడుకు భారీ పెట్టుబడులు...
జనరల్

తమిళనాడుకు భారీ పెట్టుబడులు...

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా స్మార్ట్ రేషన్ కార్డులు.. టీజీ కేబినెట్ కీలక నిర్ణయం
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా స్మార్ట్ రేషన్ కార్డులు.. టీజీ కేబినెట్ కీలక నిర్ణయం

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ
జనరల్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
జనరల్

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూలు

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
జనరల్

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్
జనరల్

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!