

పండగల నేపథ్యంలో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో రాష్ట్ర వినియోగదారులకు ఉల్లిని అందించనున్నారు. ధరల స్థిరీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై ఉల్లి, పామోలిన్, కందిపప్పు తదితర నిత్యావసరాల ధరలపై సమీక్ష నిర్వహించింది.
రాష్ట్రానికి 1.20 లక్షల టన్నుల కందులను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని, వాటిని ప్రాసెసింగ్ చేసి రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించాలని మంత్రులు నిర్ణయించారు. పామోలిన్ను రాయితీ ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 651 ప్రాంతాల్లో రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని రైస్ మిల్లర్ల నుంచి 10 వేల టన్నుల కేఎన్ఎం రకం బియ్యాన్ని సేకరించి కౌంటర్ల ద్వారా విక్రయించాలని ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!