

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) 1980 పాస్పోర్ట్ నిబంధనల ప్రకారం పాస్పోర్ట్ ఫీజులను సవరించింది. కొత్త రుసుములు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో కొత్తగా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు గతంతో పోలిస్తే అధిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల సాధారణ పాస్పోర్ట్కు రూ.2,500, తత్కాల్ సేవ కింద రూ.5,000 ఫీజు నిర్ణయించారు. 60 పేజీల సాధారణ పాస్పోర్ట్కు రూ.3,500, తత్కాల్ సేవకు రూ.6,000 వసూలు చేయనున్నారు.
పాస్పోర్ట్ పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్నా రీప్లేస్మెంట్ ఛార్జీలు కూడా పెరిగాయి. 36 పేజీల పాస్పోర్ట్ రీప్లేస్మెంట్కు సాధారణ సేవలో రూ.5,000, తత్కాల్ సేవలో రూ.7,500 చెల్లించాల్సి ఉంటుంది. 60 పేజీల పాస్పోర్ట్ రీప్లేస్మెంట్కు సాధారణ సేవలో రూ.6,000, తత్కాల్ సేవలో రూ.8,500 వరకు ఫీజు నిర్ణయించారు. కొత్త ఫీజుల అమలుతో విదేశీ ప్రయాణాలకు సిద్ధమవుతున్నవారిపై అదనపు ఆర్థిక భారం పడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!