

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప దార్శనిక నాయకుడని, మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని అద్భుతంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దడం చంద్రబాబు ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన విధానం అసాధారణమని అన్నారు. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్లో ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతి విశేషాలతో రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. మంత్రి నారా లోకేశ్ విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలను ఎంపీ కుమార్తె నిఖిల ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలిశెట్టి తనది సాధారణ గ్రామీణ నేపథ్యమని చెప్పగా, ముర్ము తన బాల్యం, నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటూ తాను కూడా సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎంపీని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లుగా అనిపిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!