

ఏపీలో లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నట్లు నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత వారిని సిట్ కస్టడీకి తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ కేసు అత్యంత తీవ్రమైనదని, ఇందులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈడీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేస్తే తప్పేమిటని నిందితుల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. ఈడీ కస్టడీ అనంతరం సిట్ కస్టడీ కోసం ప్రొడక్షన్ వారెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సంబంధిత కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, దానిని మెరిట్స్ ఆధారంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!