
జనరల్

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కరోనా కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక జ్వరంతో ఆసుపత్రికి రావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఆమెకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.
పాజిటివ్గా తేలిన వెంటనే బాలికను కోవిడ్ వార్డుకు తరలించి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!