
ఆరోగ్యం

అమరావతి రవాణా వ్యవస్థలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉన్న అన్ని అవరోధాలను అధిగమించామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ-13, ఈ-15 రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అవి పూర్తయితే మూడు కీలక రూట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీంతో అమరావతికి జాతీయ రహదారులతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని వివరించారు.
అమరావతి అభివృద్ధి ఇకపై ఎక్కడా ఆగదని, పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి తొలి దశ అభివృద్ధి పనులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధితో రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!