
టెక్నాలజీ

కదిరి టీడీపీ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్, సీఐ నాగేంద్రపై ఆరోపణలు చేస్తూ భాగ్యరాజ్ అనే వ్యక్తి విడుదల చేసిన సెల్ఫీ వీడియోతో వివాదం నెలకొంది. తనను ఎమ్మెల్యే, సీఐ వేధిస్తున్నారని, తనకు ఏదైనా జరిగితే అందుకు వారే బాధ్యులని భాగ్యరాజ్ వీడియోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఘటనపై చర్చ ప్రారంభమైంది.
కదిరి మండలం కమతంపల్లి గ్రామంలో ఇంటి స్థలం వివాదమే ఈ ఘటనకు కారణమని సమాచారం. ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి రావడంతో భాగ్యరాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. సెల్ఫీ వీడియో విడుదల అనంతరం భాగ్యరాజ్ తన భార్య, పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా, వీడియోలో చేసిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!