

హిమాలయాల సానువుల్లో సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో అత్యంత క్లిష్టమైన జోజి లా టన్నెల్ నిర్మాణం పూర్తయింది. జమ్మూకశ్మీర్–లద్దాఖ్లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించే ఈ సొరంగాన్ని తెలుగు సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. తీవ్ర శీతల పరిస్థితులు, మంచు తుపానులు, -20 నుండి -30 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య పని చేస్తూ ఇంజినీర్లు ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సొరంగం 13.15 కి.మీ పొడవుతో నిర్మించబడగా, మొత్తం ప్రాజెక్ట్ పొడవు 30.89 కి.మీ.గా ఉంది. రెండు వైపులా రాకపోకలు సాధ్యమయ్యేలా రూపొందించిన ఈ టన్నెల్లో భద్రత కోసం షాఫ్ట్స్, కృత్రిమ సొరంగాలు, స్నో గ్యాలరీలు కూడా నిర్మించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ టన్నెల్ను ప్రారంభించనున్నారు. ఇది లద్దాఖ్కు ఏడాది పొడవునా కనెక్టివిటీ కల్పించడంతో పాటు దేశ భద్రతలో కీలక పాత్ర పోషించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!