

రేవంత్ రెడ్డి క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖలకు చెందిన నిరుపయోగ స్థలాలను గుర్తించాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల స్థలాలను ఉపయోగించి, సంబంధిత శాఖలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని చెప్పారు. జనావాసాలకు దూరంగా ఇండ్లు నిర్మిస్తే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, అవి నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి ఫ్లాట్ సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో యూనిట్కు రూ.11 లక్షల వ్యయం కాగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాలి. భూమి ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఇండ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!