
జనరల్

రెండు రోజుల పాటు నిర్వహించిన ‘తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్’ కొత్త నాయకత్వ ఉద్యమానికి నాంది పలికిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేవలం అధికారం మాత్రమే కాకుండా.. సుపరిపాలన, నిరంతర ప్రజాసేవ, నిబద్ధతే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ, భవిష్యత్తును నిర్మించే దార్శనికతతో ప్రజాప్రతినిధులు ముందుకు సాగేందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే కాంక్లేవ్ ఉద్దేశమని చంద్రబాబు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిత్య విద్యార్థుల్లా కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ రెండు రోజుల కాంక్లేవ్ మరింత ధృఢమైన, బలమైన నాయకత్వ పటిమను అందించిందని చంద్రబాబు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!