
గాసిప్స్

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ మేతి మేనకోడలు అంకిత యరగల్ను బాగల్కోట్లోని ప్రభుత్వ నమ్మల్ క్లినిక్లో మెడికల్ ఆఫీసర్ పదవి నుంచి అధికారులు తొలగించారు. ఆమె కొన్ని నెలలుగా అక్కడ విధులు నిర్వహిస్తూ నెలకు రూ.70 వేలకు పైగా జీతం పొందుతున్నట్లు సమాచారం.
అయితే ఈ ఏడాది మార్చి నుంచి ఆమె విధులకు గైర్హాజరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా, అంకిత ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ విద్యను అభ్యసిస్తున్నట్లు తేలింది. ప్రభుత్వ వైద్యురాలిగా జీతం పొందుతూ మరోచోట పీజీ చదవడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆమెకు నోటీసు జారీ చేసి బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో జిల్లా ఆరోగ్య అధికారి ఆమెను మెడికల్ ఆఫీసర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!