
సినిమాలు

నీట్ రీ-ఎగ్జామినేషన్కు సంబంధించిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది. అలాగే జూన్ 21న నిర్వహించనున్న పరీక్షపై తాత్కాలిక స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసును జస్టిస్ నరసింహ ధర్మాసనానికి బదిలీ చేస్తూ తదుపరి విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహణకు మార్గం సుగమమైంది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది, కొందరి తప్పిదాల కారణంగా లక్షలాది మంది విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని వాదించారు. ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థులపై రీ-ఎగ్జామ్ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ దశలో మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం జూలైలో తదుపరి విచారణ జరగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!